- గర్భిణి మృతి
- ఆరుగురు పోలీసులు సస్పెండ్
ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్లో పోలీసుల దాడిలో గర్భిణి మృతి చెందిన ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఫిరోజాబాద్లోని షికోహాబాద్కు చెందిన అంజలి (28) మృతి చెందగా, ఘటనపై ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. సబ్ఇన్స్పెక్టర్లు ధర్మపాల్ సింగ్, సత్యపాల్ సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు మోహన్ సింగ్, అరవింద్ కుమార్, కానిస్టేబుళ్లు భవతోష్ కుమార్, కుల్దీప్ కుమార్లపై చర్యలు తీసుకున్నారు. దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న గౌరవ్ కోసం ఆదివారం రాత్రి సుమారు 11.45 గంటలకు పోలీసులు అంజలి ఇంటికి వెళ్లారు. తన భర్తను అరెస్టు చేయవద్దని ఆమె పోలీసులను వేడుకున్న సమయంలో, సబ్ఇన్స్పెక్టర్ ధర్మపాల్ సింగ్ ఆమె కడుపుపై తన్నినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనంతరం అంజలి ఆరోగ్యం విషమించడంతో షికోహాబాద్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పరిస్థితి మరింత విషమించడంతో ఫిరోజాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. నవజాత శిశువు ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణకు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.







కామెంట్లు (0)