గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సుప్రీంకోర్టుకు తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌

1 గంట క్రితం

tarun tejpal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 20, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : బాంబే హైకోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 6న బాంబే హైకోర్టు 2013 నాటి అత్యాచారం కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించింది. పదేళ్ల జైలుశిక్ష‍ విధించింది. అలాగే 2021లో గోవా ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. తేజ్‌పాల్‌ తరఫున న్యాయవాది ఆదిత్య సమద్దార్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుతో పాటు శిక్షను కూడా ఆయన పిటిషన్‌లో సవాలు చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్