ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్ క్లీన్‌ స్వీప్

1 గంట క్రితం

t20
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మూడో టి-20లో 35 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు

హరారె : శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా తొలి టి-20 సిరీస్ సాధించింది. జింబాబ్వేతో మూడు టి-20ల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టి-20లో భారత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 157/7 స్కోరుకు పరిమితమైంది. ర్యాన్‌ బర్ల్‌ (54; 43 బంతుల్లో 5 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. వెస్లీ మద్వీర (28), బెన్‌ కర్రాన్ (20), డియోన్‌ మైయర్స్‌ (19) రన్స్‌ చేశారు. మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 3, యశ్‌ ఠాకూర్‌ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్‌, అశోక్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (81; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (29; 26 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (27; 18 బంతుల్లో), రింకు సింగ్ (25), తిలక్ వర్మ (11) పరుగులు చేశారు. అభిషేక్ శర్మ (2) విఫలమయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 2, సికిందర్ రజా, వెస్లీ మద్వీర, ముజరబాని ఒక్కో వికెట్ పడగొట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్