- మూడో టి-20లో 35 పరుగుల తేడాతో భారత్ గెలుపు
హరారె : శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా తొలి టి-20 సిరీస్ సాధించింది. జింబాబ్వేతో మూడు టి-20ల సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన మూడో టి-20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 157/7 స్కోరుకు పరిమితమైంది. ర్యాన్ బర్ల్ (54; 43 బంతుల్లో 5 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. వెస్లీ మద్వీర (28), బెన్ కర్రాన్ (20), డియోన్ మైయర్స్ (19) రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3, యశ్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్, అశోక్ శర్మ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (81; 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లు) అదరగొట్టాడు. ఇషాన్ కిషన్ (29; 26 బంతుల్లో), శ్రేయస్ అయ్యర్ (27; 18 బంతుల్లో), రింకు సింగ్ (25), తిలక్ వర్మ (11) పరుగులు చేశారు. అభిషేక్ శర్మ (2) విఫలమయ్యాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 2, సికిందర్ రజా, వెస్లీ మద్వీర, ముజరబాని ఒక్కో వికెట్ పడగొట్టారు.







కామెంట్లు (0)