హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీల్లో వెటరన్ అథ్లెట్, ఎంఎల్ఆర్ఐటి చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి సత్తా చాటారు. రెండు రోజుల పాటు అంబర్పేట్లోని స్విమ్మింగ్పూల్లో జరిగిన పోటీల్లో మర్రి లక్ష్మణ్రెడ్డి నాలుగు పతకాలు సాధించారు. క్రీడలపై ఆసక్తి, ఫిట్నెస్పై శ్రద్ధతో క్రమశిక్షణతో సాధన చేస్తూ రెండు పసిడి, ఓ రజతం, ఓ కాంస్య పతకం సాధించిన మర్రి లక్ష్మణ్రెడ్డిని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అభినందించారు.








కామెంట్లు (0)