ప్రజాశక్తి - విశాఖపట్నం : సిపిఎం, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకులు అరుణ్ జీ మంగళవారం అర్ధరాత్రి విశాఖపట్నంలో కన్నుమూశారు. కరాసలో ఆయన పార్థివదేహం వద్ద సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం. జగ్గు నాయుడు, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ సహా పలువురు జిల్లా నాయకులు, అరుణ్ జీ సహచరులు నివాళ్లు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అరుణ్ జీ తొలి నుంచీ సిపిఎం, ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజానాట్యమండలి నిర్మాణంలో ఆయన పాత్ర చెప్పుకోదగ్గది. ప్రజాశక్తి ఏజెన్సీ బాధ్యతలను సుదీర్ఘకాలంగా నిర్వర్తిస్తూ వచ్చారు. ఆయన మృతి పట్ల ప్రజాశక్తి సంపాదకులు బి. తులసీదాస్, సిజిఎం వై. అచ్యుతరావు, విశాఖ జనరల్ మేనేజర్ ఎం. వెంకటేశ్వరరావు ప్రకటనలో సంతాపం తెలిపారు. అరుణ్ జి భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం ఆంధ్ర మెడికల్ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు.
అరుణ్ జీ కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 19, 2026, 01:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)