ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఈగల్ విభాగం చీఫ్, సైబర్ క్రైమ్ ఐజి ఆకే రవికృష్ణ కలిశారు. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో
శుక్రవారం మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. ఈగల్ విభాగ వార్షిక నివేదికను పవన్కు రవికృష్ణ అందించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకొంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను ఈ నివేదికలో వివరించారు. సోషల్ మీడియా వేధింపులు, ట్రోలింగ్, మహిళలను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై సైబర్ క్రైమ్ విభాగం ద్వారా తీసుకొంటున్న చర్యలను వివరించారు.








కామెంట్లు (0)