ప్రజాశక్తి - మైదుకూరు : విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ద దంపతులు మృతి చెందిన ఘటన కడప జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. మైదుకూరులో ఆకుల వీధిలో నివసిస్తున్న పందిటి నడిపి సుబ్బరాయుడు(85), ఓబులమ్మ(75)లు విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ద దంపతులు మృతి చెందిన విషాద సంఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకున్నది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం బద్వేల్ రోడ్డులోని వెంకటేశ్వర సినిమా హల్ వీధిలో వరి పొట్టు తీసుకువెళ్తున్న లారీ విద్యుత్ తీగలను తగలడంతో విద్యుత్ స్తంభం విరిగి పడినది. తమ ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులు విద్యుత్ స్తంభం పడినది. విద్యుత్ స్తంభం విరిగి పడడంతో వృద్ద దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రతి రోజూ ఇంటి లోపల నిద్రించే వారని స్థానికులు చెబుతున్నారు. వృద్ద దంపతులు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభం విరిగిపడి వృద్ద దంపతులు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 08:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)