- టీ.నర్సాపురంలో విషాదం
ప్రజాశక్తి - టి.నర్సాపురం: ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం తెడ్లం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, రైతు తన పాడి గేదెలను మేత కోసం తీసుకెళ్తుండగా మార్గంలో కిందకు వేలాడుతున్న ఎల్టీ విద్యుత్ కేబుల్ వైర్లు గేదెలకు తగులుతాయని భావించి వాటిని చేత్తో పైకి లేపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో విద్యుత్ ప్రసారం కావడంతో తీవ్ర షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్లు (0)