ప్రజాశక్తి - అనంతపురం : అనంతపురం జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బిహెచ్ రాయుడు శుక్రవారం ఉదయం అనంతపురంలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించాడు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, డివైఎఫ్ఐ నాయకుడిగా, గార్లదిన్నె మండల పార్టీ కార్యదర్శిగా, సింగనమల డివిజన్ కార్యదర్శిగా పనిచేసిన బిహెచ్ రాయుడు ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. బిహెచ్ రాయుడు స్వగ్రామం బెలుగుప్ప మండలం ఎర్రగుడి వద్ద 11 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. బి హెచ్ రాయుడు మృతిపై వామపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీలో ప్రజాసంఘాల నాయకులు సంతాపం తెలియజేశారు.
రైతు సంఘం నేత బిహెచ్ నాయుడు గుండెపోటుతో మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 09:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)