మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం : ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటి ప్రవాహం తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 1 గంటకు గోదావరి నీటిమట్టం 53.20 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు నీటిమట్టం 56.10 అడుగులకు పెరిగి, మధ్యాహ్నం 2 గంటల వరకు నిలకడగా కొనసాగింది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి నీటిమట్టం తగ్గడం ప్రారంభమైంది. రాత్రి 11:16 గంటలకు 52.90 అడుగులకు పడిపోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించగా, ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
ప్రస్తుతం 14,21,034 క్యూసెక్కుల వరదనీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి పూర్తిగా తగ్గే వరకు ముంపు బాధితులు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని కలెక్టర్ అంకిత్ సూచించారు. శనివారం భద్రాచలంలో వరద పరిస్థితులను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఫ్లడ్ కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేస్తాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సమాచారం ఇచ్చి సహాయం పొందాలని తెలిపారు. అలాగే వరద తగ్గిన వెంటనే దెబ్బతిన్న రహదారులు, భవనాల మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.







కామెంట్లు (0)