ప్రజాశక్తి–పల్నాడు జిల్లా: రొంపిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో శనివారం ట్రాక్టర్ తిరగబడిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన భాస్కరరావు వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం ఉదయం ట్రాక్టర్పై పొలానికి బయలుదేరాడు. పొలంలోకి ట్రాక్టర్ను దించే సమయంలో అక్కడి ఎత్తుపల్లాల కారణంగా వాహనం అదుపుతప్పి తిరగబడింది. ఈ ప్రమాదంలో భాస్కరరావు ట్రాక్టర్ కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 10:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)