సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీకి మంత్రి అచ్చెన్నాయుడు

16 గంటల క్రితం

Minister-Atchannaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 08:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఢిల్లీ పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సోమవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించాల్సిందిగా కోరనున్నారు. అలాగే ఆక్వా రైతుల సమస్యలపైనా కేంద్రంతో కీలకంగా చర్చించనున్నారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీ పర్యటన ఉండనుందని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్