గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

'మీసేవ' ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు పోస్టర్ ఆవిష్కరణ

7 గంటల క్రితం

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 01:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : రాష్టంలో మూతపడిన 170 ప్రభుత్వ అర్బన్ 'ఇ/మీ' సేవ కేంద్రాలను ఎన్నికల హామీకి అనుగుణంగా వెంటనే తిరిగి ప్రారంభించి, ఉపాధి కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎ.వి. నాగేశ్వరావు డిమాండ్ చేశారు. విజయవాడలోని సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో ఎపి 'ఇ' (మీ) సేవ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న 'ఉద్యోగ సాధన సంకల్ప దీక్షల' పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల్లో ఏర్పాటైన 170 ప్రభుత్వ అర్బన్ మీసేవ కేంద్రాల ద్వారా 607 మంది ఉద్యోగులు 376 రకాల సేవలను ప్రజలకు అందించేవారు. ప్రభుత్వ శాఖలకు ఏడాదికి దాదాపు రూ.4,000 కోట్లు, యూజర్ ఛార్జీల రూపంలో రూ.40 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్న వీరిని తొలగించడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చి జీవో నంబర్ 2 ద్వారా ఐటీ శాఖ పరిధిలోని 'ఇ' సేవ వ్యవస్థను సచివాలయ శాఖకు బదిలీ చేయడం వల్ల ఈ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారాని తెలిపారు. ఎపి ఇ/మీ సేవ కాంట్రాక్ట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నాగేశ్వరావు మాట్లాడుతూ.. ఈ ఉద్యోగుల వేతనాల కోసం ప్రభుత్వంపై ఎటువంటి అదనపు భారం పడదని, యూజర్ ఛార్జీల రూపంలో వచ్చే ఆదాయం నుంచే వారికి వేతనాలు చెల్లించవచ్చని తెలిపారు. ఇప్పటికే తిరుపతిలో మూడు రోజులు నిరసన దీక్షలు చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో, రానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిసెంబర్ 16, 17, 18 తేదీలలో ఇఐడి కార్యాలయం వద్ద మూడు రోజుల పాటు ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. మీసేవ ఉద్యోగులను ఆప్కోస్ లో చేర్చి తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముజాపర్ అహ్మద్, దుర్గ ప్రసాద్, రాజు కుమార్, రవి కిరణ్, పవన్ కుమార్, గౌరిశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్