సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసింగపూర్‌ బృందం ఆర్‌‌టిజిఎస్‌ సందర్శన

14 జులై, 2026

singapur
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 11:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్‌టిజిఎస్‌) కేంద్రాన్ని సింగ‌పూర్‌ ప్ర‌తినిధుల బృందం మంగ‌ళ‌వారం సంద‌ర్శించింది. స‌చివాల‌యంలోని ఆర్‌‌టిజిఎస్‌ కమాండ్‌ ‌కంట్రోల్‌ కేంద్రాన్ని ఈ బృందం తిల‌కించింది. సింగ‌పూర్ ప్ర‌భుత్వ సాంకేతిక విభాగం అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట‌న్ ఇంగ్ ఫెండ్ నేతృత్వంలో వ‌చ్చిన ఈ బృందానికి ఆర్‌‌టిజిఎస్‌ అధికారులు స్వాగ‌తం ప‌లికారు. ఆర్‌‌టిజిఎస్‌ ప‌నితీరును ఆ బృందానికి వివ‌రించారు. డేటా డ్రివ‌న్ గ‌వ‌ర్నెన్స్ ఆశ‌యాలు, డేటా లేక్‌, డేటా లెన్స్‌ త‌దిత‌ర కార్యక‌లాపాల గురించి ఆర్‌‌టిజిఎస్‌ అధికారులు వివ‌రించారు. సింగ‌పూర్ ప్ర‌భుత్వం డేటా స‌మ‌ర్థ వినియోగంతో నిర్వహిస్తున్న కార్య‌క‌లాపాల‌ను ప్ర‌తినిధి బృందం వివ‌రించింది. ఈ స‌మావేశంలో ఆర్‌‌టిజిఎస్‌ సిఇఒ ప్ర‌ఖర్ జైన్‌, డిప్యూటీ సిఇఒ ఎం మాధురి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు పి శ్రీఖ‌ర్‌, కె చైత‌న్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్