మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition తొలి రోజు టెట్ ప్రశాంతం

05 ఆగస్టు, 2026

ap-tet.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 10:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)‌ సోమవారం ప్రారంభమైంది. తొలిరోజు తెలుగు పరీక్ష (పేపర్‌-2ఎ) ‌రెండు పూటలా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఉదయం 8,,148 అభ్యర్ధులకు కేటాయించగా, వీరిలో 7453(91.4శాతం) మంది అభ్యర్ధులు హాజరయ్యారని టెట్‌ ‌కన్వీనర్‌ ఎంవి కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మధ్యాహ్నం 42 పరీక్షా కేంద్రాల్లో 5,801 మంది అభ్యర్ధులను కేటాయించగా 5,342(91.78శాతం)మంది హాజరయ్యారు. ఉదయం సెషన్ లో అనంతపురం జిల్లాలో 93.94శాతం, మధ్యాహ్నం సెషన్‌‌లో కడప జిల్లా 94.8శాతం అత్యధికంగా హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కన్వీనర్‌ ‌వెల్లడించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్