సోమవారం, 17 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజమహేంద్రవరంలో విషాదం

1 గంట క్రితం

godavari
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 08:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- గోదావరిలోకి దూకిన ఇంజినీర్‌ కుటుంబం

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కమ్‌ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన ఇంజినీర్‌ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. నలుగురిలో ఒక కుమారుడికి ఈత రావడంతో అతడు నీటి నుంచి బయటపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంజినీర్‌ దంపతులు, మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్