శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టెట్ సమస్యల పరిష్కారానికి యుటిఎఫ్ నిరాహార దీక్షలు

1 గంట క్రితం

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 05:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిఐటియు సంపూర్ణ మద్దతు

ప్రజాశక్తి - విజయవాడ: టెట్ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షలకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సెప్టెంబర్ 4 నుంచి యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.వి.నాగేశ్వరరావు సభ్యులకు దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షల్లో అర్హత నిబంధనలను సడలించాలని, ఉపాధ్యాయులు బోధిస్తున్న సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు స్పెషల్ టెట్ను ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలని కోరారు. జిల్లా, మండల స్థాయిల్లో యుటిఎఫ్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఏ.వి. నాగేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిర్వహించే పోరాటాల్లో సిఐటియు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్. ప్రసాద్, వివిధ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్