ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని రైతు సోదరులకు 'ఏరువాక పున్నమి' పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన జరుపుకునే ఈ పండుగ.. భూమాతకు, పశుసంపదకు గౌరవం ఇస్తూ, ప్రకృతికి - మనిషికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటుతుందని ఆయన పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి, వ్యవసాయాభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా ఇప్పటికే 'పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ' పథకం మొదటి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. త్వరలో ప్రారంభం కానున్న 'వీబీ-జీ ర్యామ్ జీ' ప్రాజెక్టుల ద్వారా కూడా రైతులకు మేలు చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక విధానాలతో పనిచేస్తోందని పవన్ స్పష్టం చేశారు.








కామెంట్లు (0)