విజయవాడ : రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిరంగపరచాలని, అఖిలపక్ష సమావేశం జరపాలని సిపిఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ రిపోర్టును బహిరంగపరచాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదన్నారు. దీనిపై సమగ్రంగా చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం జరపాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. బిసి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజన్ కమిటీ జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించిన అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. ఇందులో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇవ్వాలో కమిటీ పలు సూచనలు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయన్నారు. అలాగే రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా వివిధ ప్రతిపాదనలు చేసినట్లు తెలిసిందన్నారు. వాటిపైన ముఖ్యమంత్రితో సహా పలువురు అభిప్రాయాలు కూడా వ్యక్తపర్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయన్నారు. స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్లపై పలు పార్టీలు, సంఘాలు, సంస్థలు గత కొంతకాలంగా అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయనీ, కాబట్టి కమిటీ తన రిపోర్టును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను బహిరంగపరిచి అందరికీ అందుబాటులో ఉంచడం సముచితంగా ఉంటుందని, అలాగే ప్రభుత్వం ఈ నివేదికపై అఖిలపక్ష సమావేశం జరిపి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని సిపిఐ(యం) కోరుతున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేషన్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బహిరంగపరచాలి : సిపిఐ(యం)
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 17, 2026, 02:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)