శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బిమన్‌బసుకు అస్వస్థత

4 గంటల క్రితం

bimaon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 11:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స

ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీనియర్‌ నాయకులు, పశ్చిమ బెంగాల్‌ లెఫ్ట్ ఫ్రంట్‌ కన్వీనర్‌ బిమన్‌ బసు కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య పరిశోధన సంస్థ (ఎయిమ్స్‌) ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని సిపిఎం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం శనివారం నాడు తెలిపారు. కాగా సిపిఎం కేంద్ర కమిటీ కూడా బిమన్‌బసు ఆరోగ్యానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన పోస్టు చేసింది. బిమన్‌బసుకు గుండె సంబంధిత ఎలెక్టివ్ పెర్క్యుటేనియస్ హార్ట్ వాల్వ్ ఇంప్లాంటేషన్ చికిత్స నిర్వహించారని, పేస్‌మేకర్‌ (గుండె స్పందనను ప్రేరేపించే చిన్న పరికరం) అమర్చారని తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్