ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆపరేషన్‌ టైగర్‌ కంప్లీట్‌ : షిండే పార్టీలోకి మారిన ఠాక్రే శివసేన ఎంపీలు

23 జూన్, 2026

Uddhav Thackeray
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌‌నాథ్‌ ‌షిండే చేపట్టిన ఆపరేషన్‌ ‌టైగర్‌ ‌పూర్తయింది. ఉద్దవ్‌‌ఠాక్రే శివసేన(ఉద్ధవ్‌ ‌బాలాసాహెబ్‌ ‌ఠాక్రే)కి చెందిన ఆరుగురు ఎంపీలు సోమవారం షిండే గ్రూపులోకి చేరారు. తన పార్టీలోకి చేరిన ఈ ఎంపీలను షిండే స్వాగతించారు. వారిని క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధులుగా, రాష్ట్రానికి చెందిన నిజమైన "ధురంధరులు" (దిగ్గజాలు)గా ఆయన అభివర్ణించారు.

కాగా, శివసేన (యుబిటి)కి చెందిన ఆరుగురు ఎంపీలు నగేష్ పాటిల్ అస్తికర్ ( హింగోలి), ఓంప్రకాష్ నింబాల్కర్ (ఉస్మానాబాద్), సంజయ్ దిన పాటిల్ (ముంబై నార్త్-ఈస్ట్), సంజయ్ దేశ్‌ముఖ్ (యవత్మాల్-వాషిమ్), సంజయ్ జాదవ్ (పర్భానీ), భౌసాహెబ్ వాక్‌చౌరే (షిర్డీ) షిండే శివసేన గ్రూపులోకి మారారు. ఈ ఎంపీలు షిండే వర్గంలోకి మారడంతో లోక్‌‌సభలో ఉద్ధవ్‌ ‌సేన ఎంపీల సంఖ్యల మూడుకి పడిపోయింది. షిండే వర్గం ఎంపీల సంఖ్య 13కి పెరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్