తిరువనంతపురం : అయోధ్య రామమందిర విరాళాల అవకతవకలపై ప్రధాని మోడీ దేశానికి వివరణనివ్వాలని కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆదివారం ఆయన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. అయోధ్య రామమందిర విరాళాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న వార్తలు తీవ్ర విచారకరమని అన్నారు. రాజకీయ లబ్థి కోసం ప్రజల విశ్వాసాన్ని వాడుకున్న నేతలు ఇప్పుడు వ్యవస్థీకృత ఆర్థిక మోసానికి సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని అన్నారు. విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోడీ దేశ ప్రజలకు వివరణనివ్వాలని డిమాండ్ చేశారు. భక్తుల నుండి సేకరించి ప్రతి రూపాయికి జవాబుదారీతనాన్ని ఇచ్చేలా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుకు కేంద్రం ఆదేశాలివ్వాలని కోరారు.
విరాళాల అవకతవకలపై ప్రధాని మోడీ వివరణనివ్వాలి : పినరయి విజయన్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 05:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)