జస్టిస్ గోకుల్దాస్ కమిషన్ నివేదిక
నాటి ఘటనలో 70 మంది ప్రాణాలు బలి
చెన్నై : తమిళనాడులోని కల్లకురిచి కల్తీ మద్యం ఘటనకు పోలీసులు, ప్రొహిబిషన్- ఎక్సైజ్ శాఖ అధికారులదే బాధ్యత అని జస్టిస్ బి. గోకుల్దాస్ విచారణ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. కమిషన్ నివేదిక మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2024 జూన్లో జరిగిన ఈ కల్తీ మద్యం ఘటనలో 70 మంది మృతి చెందగా, మరో 130 మందికిపైగా వివిధ రకాల అనారోగ్యాలకు గురయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై జస్టిస్ బి. గోకుల్దాస్ విచారణ కమిషన్ దర్యాప్తు నిర్వహించింది. "మిథనాల్ నిల్వ, రవాణా, అమ్మకాలను పర్యవేక్షించే అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే, ఈ ప్రాణాంతక రసాయన పదార్థం చెన్నై నుండి కల్లకురిచికి చేరి ఉండేది కాదు" అని నివేదిక పేర్కొంది.







కామెంట్లు (0)