ఈ దేశం వెయ్యి ముక్కలయ్యింది
మతాలుగా, కులాలుగా, గోత్రాలుగా
ప్రజలూ - వాళ్ళ మెదళ్ళూ అన్నీ
ముక్కలయిపొయ్యాయి,
తుత్తునియలైపొయ్యాయి.
ఈ దేశంలో మా ప్రతి రోజూ
కాలిపోతూ ఉంది.
మా జీవితపు ప్రతిక్షణాన్ని
మాడ్చేస్తూ ఉంది.
అన్నీ భరిస్తూ, బండలా పడి ఉండడం
ఇక మా వల్ల కాదు-
భరించం- ఒప్పుకోం!
మా అరుపులు, మా కేకలు
ఈ దేశ చరిత్రను తిరగరాయడానికి
చేసే ప్రయత్నాలే!
హృదయం లేని మతంతో
ఈ దేశం నగ్నంగా నిలబడి ఉంది-
ఇక్కడి నేతలు దొడ్డి దారి చట్టాలతో
ఖుషీ ఖుషీగా జల్సాలకు అలవాటు పడ్డారు
అసలు మేమిక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమన్నది
కూడా మరిచిపొయ్యారు-
ఇంకా ఎందుకిక్కడ? పదండి పోదాం…
బతికినంత కాలం,
ఇంత కూడూగుడ్డా దొరికే చోటికి!
చస్తే - నాలుగడుగుల
ప్రశాంత స్థలం దొరికే చోటికి!!
( ప్రతిరోజూ ఇక్కడి పౌరసత్వం వదులుకుని సుమారు 500 లకు పైగా భారతీయులు వలసలు పోతున్న నేపథ్యంలో )
- ప్రొ. దేవరాజు మహారాజు








కామెంట్లు (0)