విజయానికి 288 పరుగుల దూరంలో శ్రీలంక
శ్రీలంకతో గాలె టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారీ లక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లు ఆరంభంలోనే తడబడ్డారు. భారత బౌలర్ల విజృంభణతో శ్రీలంక కేవలం 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 193 పరుగులకే కుప్పకూలినా.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో లంక ముందు 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో సిరాజ్, మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో వికెట్తో లంకను దెబ్బతీశారు. అయితే ధనంజయ డి సిల్వ (31), సొనాల్ దినుష (25) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 34 ఓవర్లలో 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. చివరి రోజు లంక విజయానికి ఇంకా 288 పరుగులు అవసరం కాగా, చేతిలో ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి.







కామెంట్లు (0)