విండ్హోక్: ముక్కోణపు సిరీస్లో జింబాబ్వే జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. తొలి మ్యాచ్లో దక్షిణాఫికాకు షాక్ ఇచ్చిన నమీబియాను 5 పరుగుల తేడాతో ఓడించింది. నమీబియా క్రికెట్ గౌండ్లో సోమవారం జరిగిన మ్యాచ్లో తొలిగా బ్యాటింగ్కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195పరుగుల భారీస్కోర్ చేసింది. ఛేదనలో నమీబియా జట్టు 19.3ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి విజయానికి 6పరుగుల దూరంలో ఉన్న దశలో జింబాబ్వే బౌలర్ ఎవాన్స్ మాయ చేశాడు. చివరి మూడు బంతుల్లో ముగ్గురిని ఔట్ చేశాడు. జింబాబ్వే జట్టు 5పరుగులు తేడాతో సంచలన విజయం నమోదు చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవాన్స్కు దక్కింది.
ఎవాన్స్ మాయ నమీబియాపై జింబాబ్వే గెలుపు
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)