టాస్కెంట్: ఎఎఫ్సి అండర్-20 ఫుట్బాల్లో భారత పురుషుల యువ జట్టు సంచలనం నమోదు చేసింది. టస్కెంట్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో భారత ఫుట్బాల్ జట్టు 1-0తో సిరియాపై విజయం సాధించింది. ఏకైక గోల్ను 86వ నిమిషంలో సింగమయుమ్ షమీ చేశాడు. కార్నర్నుంచి కొట్టిన బంతిని సింగమయూన్ గోల్లోకి కొట్టడంతో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మరో గోల్ చేసే సువర్ణావకాశం భారత్కు లభించినా.. ఆ బంతి ఆఫ్సైడ్ కావడంతో గోల్గా పరిగణించలేదు.
ఎఎఫ్సి అండర్-20 ఫుట్బాల్లో సిరియాపై భారత్ గెలుపు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)