మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారత మహిళల హాకీ జట్టుకు కఠిన పరీక్ష

1 గంట క్రితం

hokey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 10:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఎఫ్‌ఐహెచ్‌ ‌హాకీ ప్రపపంచకప్‌

బ్రూసెల్స్‌ (‌బెల్జియం): ఈనెల 15నుంచి జరిగే ఎఫ్‌ఐహెచ్‌ ‌ప్రపంచకప్‌‌లో భారత మహిళలజట్టు కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. ఎఫ్‌ఐహెచ్‌ మంగళవారం విడుదల చేసిన డ్రాలో భారత మహిళలజట్టుకు పూల్‌-‌డిలో చోటు లభించింది. ఈ పూల్‌లో ఆసియా ఖండానికి చెందిన చైనాతోపాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ ‌జట్లు ఉన్నాయి. టోర్నీలో ఆడే మొత్తం 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ఆతిథ్య దేశాలైన బెల్జియంకు పూల్‌-‌సిలో నెదర్లాండ్స్ కు పూల్‌-ఎలో చోటు దక్కింది. ఈ రెండు దేశాలు ఈసారి ఎఫ్‌ఐహెచ్‌ ‌ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ప్రతి పూల్‌‌లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఇంటర్మీడియట్ రౌండ్‌(నాకౌట్‌)కు చేరుకుంటాయి.

పూల్స్‌...

ఎ: ఆస్ర్టేలియా, చిలీ, జపాన్‌, నెదర్లాండ్స్‌

బి: అర్జెంటీనా, జర్మనీ, స్కాట్లాండ్‌, అమెరికా

సి: బెల్జియం, స్పెయిన్‌, ఐర్లాండ్‌, న్యూజిలాండ్‌

డి: చైనా, ఇంగ్లండ్‌, ఇండియా, దక్షిణాఫ్రికా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్