__
___పల్లవి:- అదిగదిగో అణగారిన గొంతుల__నినాదం
అసమానత వివక్షలు తొలగించే నినాదం
_ _ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఈ కులాల అడ్డుగోడలు
___కూల్చేందుకు మ్రోగింది సామాజిక శంఖారావం
___జాతి మతం వేరైనా ఏకత్వం మన భారతం
___భాషలు ఎనున్న సమానత్వం మననినాదం
___తక్కువెక్కువ తేడాలు ఐక్యతకు అవరోధం
__ఈ అస్థవ్యస్థ లోపాలను సరిదిద్దగ కదలాలి
_శ్రమజీవి చెమటతో సోమరుల గొంతు తడిపి
__గంజి నీళ్లు ఆసరాతో ధనికుల కోటలు కట్టిరి
__ మీ దేవుళ్ళకు మారక్తం నొసటి బొట్టయ్యే __
__మేం గుడిగడప ఎక్కితే ఛీ.. ఛీ మైలంటారే
__పనిని బట్టి కులాల విభజన జరిగెను సత్యం
__వర్ణాశ్రమ ధర్మమనే మాయగీతలు కల్పితం
__బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మెట్ల కుంపటినీ
__వ్యవస్థాగతం__చేశారు భూస్వామ్య ధోపిడిని
ఊరిదేవర సంబరాల్లో నాట్యమాడె బొమ్మలనుచేసిరి
జోగినీల పేరుతో కాముకులు స్త్రీల జీవితాలు దోచిరి
ఆదిపత్య కులమతాలు స్త్రీల ఆత్మగౌరవాన్ని హరించిరి
సనాతన సంక్కెళ్ళు వేసి స్వేచ్ఛగొంతు నులుమితిరి
వేదనలు రోదనలతో ఎంతకాలం కుములుదాం
భూమి పొరలు చీల్చుకొని క్రొత్తగా మొలకెత్తుదాం
ప్రజల హక్కుల సాధనకై సమూహాలై కదులుదాం__
మనుసిద్ధాంతపు కృష్ణబిలాన్ని తొలగించగ పోరుదాం
జి.నటరాజు
9490098420








కామెంట్లు (0)