తెలంగాణ : సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. నగరంలో సోమవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. సాయంత్రం పీక్ అవర్స్లో తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే వీలుందని, ఐటి కంపెనీలు, ఇతర సంస్థలు దశల వారీగా ముందస్తు లాగౌట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా ఆయా సంస్థలు సహకరించాలని పోలీసులు కోరారు. సంస్థలు తమ లొకేషన్, ముందస్తు లాగౌట్ సమయాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
వాన కురిసే అవకాశం.. ఐటి కంపెనీలకు ట్రాఫిక్ పోలీసుల అడ్వైజరీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 03:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)