ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్చురీ గదిలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

11 గంటల క్రితం

Rats gnaw on a body in the mortuary.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 04:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వరంగల్ : వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో అమానుష ఘటన జరిగింది. గౌరె వీరయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు మార్చురీకి తరలించారు. అయితే ఉదయం మృతదేహం కంటి భాగంలో ఎలుకలు కొరికిన ఆనవాళ్లను చూసి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రీజర్ లాంటి కనీస సౌకర్యాలు కూడా పోస్టుమార్టం గదిలో లేకపోవడంపై మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్