అమరావతి : ఎపి ఎప్సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. ఇటీవల ఎపి ఎప్సెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో తొలి విడత ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ను విద్యాశాఖ అధికారులు బుధవారం విడుదల చేశారు. జులై 20 నుంచి 29 వరకు మొత్తం పది రోజుల పాటు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జులై 22 నుంచి 31వరకు చేపట్టనున్నారు. జులై 25 నుంచి 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 1న వెబ్ఆప్షన్లు మార్చుకొనేందుకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 6న తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసి ఆగస్టు 7 నుంచి 13వ తేదీ వరకు కాలేజీలో సెల్ఫ్ జాయినింగ్/ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఎపి ఎప్సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 05:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)