న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం నుండి జీతాల చెల్లింపులను కోరుతూ పశ్చిమబెంగాల్లోని 360కి పైగా మదర్సాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. పిటిషనర్లలో ఎవరూ తమ కేసు చట్టపరంగా బలంగా ఉందని కోర్టును ఒప్పించలేకపోయారని జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే, వారు పనిచేస్తున్నట్లు చెప్పిన మదర్సాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా? అవి చట్టబద్ధమైన నిర్వహణ కమిటీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయా? అనే అంశాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. పిటిషనర్లలో ఎవరూ తమ తమ కేసుల యోగ్యత గురించి కోర్టును ఒప్పించలేకపోయారని జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. గుర్తింపు పొందిన పశ్చిమ బెంగాల్ మదర్సాలలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్-ఇన్-ఎయిడ్ పథకం ప్రకారం క్రమబద్ధ నియామకాలు, రాష్ట్ర నిధుల నుండి జీతాలు కోరుతూ 350 మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ మదర్సా సర్వీస్ కమిషన్ చట్టం, 2008ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడాన్ని కోల్కతా హైకోర్టు సమర్థించింది. రాష్ట్రంలోని వివిధ మదర్సాలలో తమను నియమించారని పేర్కొంటూ 361 మంది పిటిషనర్లు 40కి పైగా పిటిషన్లు దాఖలు చేశారు.
360కి పైగా మదర్సాల పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 12:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)