ముంబయి : తమ ఖాతాదారులకు పూర్తి స్థాయి ఆర్థిక సేవలు అందించే క్రమంలో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ పంపిణీ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. డిజిటల్ పద్ధతిలో సులభంగా పెట్టుబడులు పెట్టేలా రూపొందించిన ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, రిలేషన్షిప్ మేనేజర్ల సాయంతో ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చని పేర్కొంది. వినియోగదారుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకమైన సంపద సృష్టి అవకాశాలను కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని ఆ బ్యాంక్ వెల్లడించింది.
ఎంఎఫ్ సేవల్లోకి ఉజ్జీవన్ ఎస్ఎఫ్బి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)