ప్రజాశక్తి - గొలుగొండ (అనకాపల్లి) : గొలుగొండ మండలంలోని ధారమఠం జలపాతం వద్ద శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. జి.మాడుగుల మండలానికి చెందిన చుక్కల వెంకట రమణ (22) తన ముగ్గురు స్నేహితులతో కలిసి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ధారమఠం జలపాతంలో జారిపడి యువకుడు మృతి
26 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 26, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)