ఎమ్మెల్యే పర్యటన ఉన్నప్పటికీ పట్టించుకోని అధికారులు...
ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో దర్శనమిస్తున్న వీధులు
ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : మండలంలోని పచ్చికాపల్లం లో పుర వీధుల్లో ఎక్కడ చూసిన చెత్త కుప్పలు ప్రయాణికులకు స్థానికులకు దర్శనమిస్తుంది. మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే విఎం థామస్ అదే పంచాయతీలో పర్యటన ఉంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. విధుల పట్ల కనీస బాధ్యత లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ చెత్త పెద్దలపై దోమలు వాలి అంటూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, గ్రామస్తులు చెబుతున్నారు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. గ్రామస్తులు వాపోతున్నారు.








కామెంట్లు (0)