సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సమతుల్యమైన ఆహారం అందించాలి

2 రోజుల క్రితం

east
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 08:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జిల్లా ఇమ్యునైజేసన్ అధికారి శ్రీదేవి

ప్రజాశక్తి- రాజమహేందవరం : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం హెల్త్ అండ్,ఐసిడిఎస్ సంయుక్తంగా సుబ్బారావు పేట షాది ఖానా లో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎం అండ్ హెచ్ ఓ పి.కోమలి పాల్గొన్నారు. టిడిపి రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, యుపీ హెచ్ సి అభివృద్ధి కమిటీ చైర్మన్ అనసూరిశ్రీనివాస్ పాల్గొన్నారు. ముందుగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా

జిల్లా ఇమ్యునైజేసన్ అధికారి శ్రీదేవి మాట్లాడుతూ తల్లిపాలు ఆరు నెలల వరకు బిడ్డకు తాగించాలని, బాలింతకు సమతుల్యమైన ఆహారం అందించాలన్నారు.

తల్లిపాలతో బిడ్డకు ఆరోగ్య రక్షణ :

డాక్టర్ ఎం.కృష్ణ అనూహ్య మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు ఇవ్వడం వలన పూర్తి ఆరోగ్య రక్షణతో ఎదుగుదల జరుగుతుందని తెలిపారు. తల్లిపాల వలన శిశువుకు రోగ నిరోధక శక్తి, జీర్ణ ప్రక్రియ మెరుగుదల అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ డి. భవాని ఐసిడిఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి, హెల్త్ సిబ్బంది అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్