ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండలం చాగల్లు-శాఖ గ్రంధాలయంలో గ్రంథాలయ పితామహులు ఎస్ ఆర్ రంగనాథన్ 134వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి గ్రంధాల అధికారి జయలక్ష్మి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠకులు , విద్యార్థులు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు . గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ ఎస్ ఆర్ రంగనాథన్ మొదట గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా జీవితం ప్రారంభించి తర్వాత ప్రముఖ గ్రంథాలయ నిపుణునిగా మారారు. ఈయన కోలన్ క్లాసిఫికేషన్ విధానాన్ని (ద్విబిందు వర్గీకరణ) కనిపెట్టారు. గ్రంథాలయ శాస్త్రపంచ సూత్రాలను (ఫైవ్ లాస్ ఆఫ్ లైబ్రరీ) ప్రతిపాదించారు. ఈయన పుట్టినరోజును జాతీయ గ్రంథాలయ పాలకుల దినోత్సవంగా జరుపుకున్నారు.
గ్రంథాలయ పితామహుడు ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 12, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)