శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదంలో యువ న్యాయవాది మృతి

1 గంట క్రితం

Young lawyer dies in road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 05:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సత్తెనపల్లి రూరల్ (గుంటూరు) : ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొన్న ఘటనలో యువ న్యాయవాది మృతి చెందాడు. ఈ సంఘటన సత్తెనపల్లి మండలం మురళీ నగర్ సమీపంలో శుక్రవారం జరిగింది. మాచర్ల నుండి గుంటూరు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సును గుంటూరు వైపు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువ న్యాయవాది అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్