ఒంగోలు (ప్రకాశం) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి ఛాంపియన్ షిప్ 2026 లో భాగంగా .... ఒంగోలులోని మినీ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో సియస్ పురంలోని కదిరి బాబురావు వ్యవసాయ కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. మంగళవారం జరిగిన క్రీడా పోటీలలో కె.యమున హై జంపులో మొదటి స్థానం సాధించారు. అదేవిధంగా టి దేరిస్సా బ్యాడ్మింటన్ లోను, ఎం.అజిత చెస్ లో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
క్రీడా పోటీల్లో సత్తాచాటిన వ్యవసాయ కళాశాల విద్యార్థినిలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)