రామభద్రపురం (విజయనగరం) : రామభద్రపురం మండలం జన్నివలసలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. జన్నివలసలో ఉన్న గిరిజన భూములను రెవిన్యూ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకుంటుండగా .... సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు అడ్డుకున్నారు. అప్పటికే అక్కడున్న పోలీసులు నేతలను, గిరిజనులను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. తెర్లాం మండల పోలీస్ స్టేషన్లో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి ఉన్నారు. 










కామెంట్లు (0)