ఎఐ సాంకేతికత విస్తరిస్తున్న నేపథ్యంలో సినీ నటులు డీప్ఫేక్ ఫొటోలు, వీడియోల బారిన పడుతున్నారు. తాజాగా నటి మృణాల్ ఠాకూర్కు సంబంధించిన డీప్ఫేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ఆమె, ‘నా డీప్ఫేక్ ఫొటోలను సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేయడం చట్టవిరుద్ధం. వాటిని వెంటనే తొలగించండి. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇదివరకే నటి రష్మిక మందన్న కూడా డీప్ఫేక్ వీడియోల బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా ఈ సమస్యను ఎదుర్కొనడంతో సినీ నటీమణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆ ఫొటోలు తొలగించకపోతే కేసు పెడతా: మృణాల్
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 09:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)