రష్మిక మందన్న నటించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’ నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. గోండ్ గిరిజన మహిళ పాత్రలో రష్మిక సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ చిత్రానికి సంబంధించి మరో 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని మేకర్స్ తెలిపారు.
నవంబర్ 27న రష్మిక ‘మైసా’
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)