టాలీవుడ్లో చిన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో కోర్టు రూమ్ డ్రామాగా రూపొందుతున్న 'డ్యూ డేట్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు సినీ రంగంలో సీనియర్ జర్నలిస్ట్, పీఆర్వోగా గుర్తింపు పొందిన ఏలూరు శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ కె దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్లో బుధవారం జరిగిన చిత్ర ప్రారంభోత్సవంలో దర్శకుడు మారుతి తొలి షాట్కు క్లాప్ కొట్టగా, నిర్మాత బన్నీ వాస్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కొత్త నటులు లోమేష్ పుడిపెద్ది, జెశ్రీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం కోర్టు నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోంది.
Print Editionకోర్టు రూమ్ డ్రామాగా 'డ్యూ డేట్'
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 09:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)