అమెరికాపై మరోసారి ఇరాన్ విరుచుకుపడింది. జోర్డాన్లోని కీలక అమెరికా వైమానిక స్థావరంపై బుధవారం రాత్రి భారీ క్షిపణి దాడులు జరిపింది. దీంతో అమెరికాకు సంబందించిన పలు యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు సమాచరాం. వీటిలో ఒక ఏ-10 థండర్బోల్ట్ విమానం నాశనం కాగా.. మరో ఎనిమిది ఎఫ్-15 యుద్ధవిమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇక దాడులను అడ్డుకునేందుకు అమెరికా బలగాలు 30కి పైగా పేట్రియాట్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత మరింత ముదిరింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ అమెరికా స్థావరాలు, మిత్రదేశాలపై వరుస దాడులకు దిగినట్లు తెలుస్తోంది.
అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 11:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)