మరో ఇద్దరికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు
నిందితుడు కూడా మృతి చెందినట్లు పోలీసుల వెల్లడి
అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది.ఇదాహోలోని ట్విన్ ఫాల్స్ నగరంలోని ప్రముఖ 'ఇన్-ఎన్-అవుట్'రెస్టారెంట్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా,మరో ఇద్దరు గాయపడ్డారు.ఈ ఘటనపై ట్విన్ ఫాల్స్ పోలీస్ చీఫ్ మాథ్యూ హిక్స్ శనివారం రాత్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.కాల్పులకు తెగబడిన అనుమానిత దుండగుడు కూడా మరణించినట్లు హిక్స్ ప్రకటించారు.అయితే,నిందితుడు ఎలా చనిపోయాడనే వివరాలు వెల్లడించలేదు. "మేము నిందితుడి గుర్తింపు,దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం"అని ఆయన వివరించారు.ది.ఓ ఫుడ్ ఫెస్టివల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా,ఐదుగురు గాయపడ్డారు.







కామెంట్లు (0)