- కొనుగోలుదారులకు షాక్
హైదరాబాద్: శుభకార్యాల సీజన్లో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులో రూ.4,300 పెరిగి రూ.1,59,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.3,950 పెరిగి రూ.1,46,000గా నమోదైంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.10,000 పెరిగి రూ.2.60 లక్షలకు చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,420, 22 క్యారెట్ల బంగారం రూ.1,46,150గా ఉంది. ధరలు భారీగా పెరగడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేసే వారి బడ్జెట్పై అదనపు భారం పడనుంది. మార్చిలోనే ₹1.73 లక్షల గరిష్ఠాన్ని తాకిన తర్వాత జూన్లో గణనీయంగా తగ్గింది. మరలా ఆగస్టులో మరోసారి భారీగా పెరుగుతోంది.







కామెంట్లు (0)