రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందనున్న ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీని కథానాయికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా, కథను ప్రభావితం చేసే బలమైన పాత్రగా సుకుమార్ రూపొందించినట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ పాత్రకు కియారా సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో రామ్ చరణ్, కియారా జంటగా 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్'లో నటించారు.
ఆర్సి 17లో కియారా అద్వానీ..!
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)