ముంబయి : భారతీయ మార్కెట్పై ప్రత్యేక దృష్టిసారించిన ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్వ్యాగన్ దేశీయంగా తయారయ్యే సరికొత్త సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్యువిని 2027 నాటికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పూర్తిగా స్థానిక ప్రాధాన్యతలతో ఎంక్యుబి-ఎ0-ఐఎన్ ప్లాట్ఫారమ్పై అభివృద్ధి చేస్తున్న ఈ వాహనం, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఫోక్స్వ్యాగన్ నుంచి అత్యంత సరసమైన ఎస్యూవీగా నిలవనుందని ఫోక్స్వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ బ్రాండ్ సిఇఒ థామస్ షేఫర్ తెలిపారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భారీ మార్కెట్ అని, ఇక్కడి కస్టమర్ల అభిరుధులకు తగినట్టుగా ఈ మోడల్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.








కామెంట్లు (0)