- నిర్మాణంలో ఉన్న భవనాల కూల్చివేత
కొచ్చి: లక్షద్వీప్లోని అగతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిపాలనా అధికారులు కూల్చివేశారు. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి గడువు ముగియక ముందే యంత్రాల సహాయంతో భవనాలను కూల్చివేశారు. నిర్మాణంలో ఉన్న భవనాల యజమానులకు ఈ నెల 10వ తేదీన పరిపాలన యంత్రాంగం నోటీసు జారీ చేసి, 17వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని కోరింది. దీనికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు వెల్లువెత్తడంతో, పోలీసులు పలువురు పార్టీ నాయకులను అరెస్టు చేశారు. లక్షద్వీప్ పరిపాలన యంత్రాంగం చేపట్టిన ఈ బుల్డోజర్ రాజ్, దక్షిణ ప్రాంతంలోని అగతిలో చోటుచేసుకుంది.
ప్రైవేట్ భూమిలో ప్రారంభించిన నిర్మాణానికి అవసరమైన డీక్లాసిఫికేషన్ సర్టిఫికేట్ పొందలేదని పేర్కొంటూ పరిపాలన యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంది. కూల్చివేత ప్రారంభమైన తర్వాత, స్థానిక నివాసితులు, వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన తెలిపారు. అరెస్టు అయిన ఎన్సిపి నాయకుడు ఓపి జబ్బార్, కాంగ్రెస్ నాయకుడు దిల్షాద్లకు సంకెళ్లు వేసి అక్కడి నుంచి తరలించడంతో నిరసనలు వెల్లువెత్తాయి. డిప్యూటీ కలెక్టర్ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. అగతిలోని నిర్మాణాలకు వ్యతిరేకంగా యంత్రాంగం తీసుకున్న ఇలాంటి చర్యలే నిరసనలకు దారితీశాయి. ఈ కొత్త పరిణామాల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.








కామెంట్లు (0)